బొత్సాకు వార్నింగ్ ఇచ్చిన రేగిడి

చీపురుపల్లి: పవన్ కళ్యాణ్ పై అవాకు చవాకులు వాగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు. పవన్ కళ్యాణ్ గారిని సన్నాసి అనిన నువ్వు నీకన్నా ఈ ఉత్తరాంధ్రలో సన్నాసి ఎవడు బొత్సా.. రిపబ్లిక్ డే అనే పదాన్ని సరిగ్గా పలకడం రాని నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వడం మా దౌర్య భాగ్యం అని విజయనగరం జిల్లా జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు ఏద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న బొత్స ధర్మాన గుడివాడ కుటుంబాలు ఉత్తరాంద్రాన్ని ఎలా ఉద్ధరించారో చెప్పాలి? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలి ఎంతమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర పై ముసలి కన్నీళ్లు పెడుతున్నారు. ఉత్తరాంధ్ర కావాలని ఒకడు ఉద్యమం చేస్తానంటాడు, ఇంకొకడు ప్రత్యేక పార్టీ పెడతానన్నాడు.. ఇంకొకడు ఐటి మినిస్టర్ గా ఉంటూ దావోసు నుండి ఐటీ మేనేజ్మెంట్ ని ఉత్తరాంధ్రకే తీసుకొస్తానంటాడు. ఇలా ఉత్తరాంధ్ర ప్రజల్ని రాయలసీమ ప్రజల్ని మోసగిస్తూ తమ పద్దాలు గడుపుకుంటున్న కొందరు స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు అందులో మొదటి వరుసలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరు ఇతను ఎన్ని పార్టీలు మారడో అతనికే తెలియదు ఛిత్త శుద్ధి లేని నాయకుడు. ప్రజలని రాష్ట్రాలని దేశాలని విభజించి పాలించడం బ్రిటిష్ వాళ్ళకే సాధ్యం అనుకున్నాం కానీ వాళ్ళని మించిపోయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తయారవడం జరిగింది. మూడుసార్లుగా మినిస్టర్ అయిన బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గాన్నే ఉద్ధరించలేని నాయకుడు ఉత్తరాంధ్ర నే ఉద్దరిస్తాడట. ఈయన వ్యవహారం ఎలా ఉందంటే తనకు ఒకటే లేదు గాని మెడకు ఒక డోలు అనే సామెతలు వ్యవహరిస్తున్నాడు. చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి నడిబొడ్డులో ఉన్న దళితుల ఎస్సీ స్మశానాన్ని ఐఎంజి జగనన్న ఇల్లు కాలనీలకి కేటాయించడంలోనే బొత్స సత్యనారాయణ గారి యొక్క రాజకీయం ఈ నియోజకవర్గ దళితులకు అర్థమవుతుందని రేగిడి లక్ష్మణరావు తెలియజేసారు.
మెరకముడిదాం మండలం మెరక ముడిదాం గ్రామంలో దళితులకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 450 కుటుంబాలకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఎన్నో ధర్నాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేని మంత్రి బొత్స సత్యనారాయణ, స్పందించలేని మెరకముడుదాం మండల జడ్పిటిసి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను వీళ్ళా ఉత్తరాంధ్ర ని ఉద్ధరించేదని రేగిడి ఏద్దేవా చేసారు. తినడానికి తిండి లేదు గాని మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది బొత్స ధర్మాన మాటలు. కేంద్రీకరణ వికేంద్రీ కరణతో ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో బొత్స, ధర్మాన సమాధానం చెప్పాలి?. మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీ వెనక లో ఏముందో చూసుకోమని రేగిడి లక్ష్మణరావు కోరారు.