జనసేనాని జన్మదిన సంబరాల కోసం క్రియాశీలక సభ్యుల సమావేశం

విశాఖపట్నం, 88వ వార్డు, విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ అధ్యక్షతన క్రియాశీలక సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో “నా సేన నా వంతు” గ్రామస్థాయిలోకి తీసుకుని వెళ్లి జనసేన కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయాలని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలను జనసేన పార్టీని ప్రజలోకి తీసుకుని వెళ్లే లాగా జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు గల్లా శ్రీనివాస్, ప్రసాద్, గోపి, హేమంత్, తేజ, శ్రీనివాస్, చలం, బాలు, రాజు, కార్తీక్, గంగు నాయుడు, రూపేష్, ప్రవీణ్, రవిబాబు, నాయుడు మరియు జనసైనికులు పాల్గొన్నారు.