అర్ధవీడు మండల జనసేన నాయకుల సమావేశం

గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండల జనసేన నాయకుల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఏ విధంగా అర్ధవీడు మండలంలోని సమస్యలపై మండల నాయకులతో చర్చించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన, టిడిపి కూటమి విజయం దిశగా ప్రతి జనసైనికుడు పని చేయాల్సివందని అదే విధంగా గ్రామాల్లో బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మండల నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన గిద్దలూరు నియోజక పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, నియోజకవర్గ సీనియర్ నాయకులు సిద్ధం వెంకటేశ్వర్లు, అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, శెట్టి శ్రీనివాసులు, దాడి మస్తాన్, గుర్రాల రామకృష్ణ నాయుడు, ముత్యపు ఎలిజిబెత్ రాణి, ప్రశాంతమ్మ, బెర్రీ శేషాద్రి నాయుడ పరిషపోగు అచ్చయ్య బండి రంగయ్య కృష్ణయ్య, వీరనాల శివ, కేశవ, ఎం శివకుమార్, తోట కేశన్న, వెంకట్రావు నాయక్, సతీష్, అర్జున్, రాజు, చందు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.