MI vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ల మధ్య మరో ఉత్కంఠ పోరు జరుగుతున్నది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. కాగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ముంబైని కింగ్స్‌ పంజాబ్‌ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన ముంబై టీమ్ ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేసులో కొనసాగుతుండగా.. 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ టీమ్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది. పంజాబ్ టీమ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.