మినీ వారాహి లక్కీ డ్రా

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ ఫండ్ నిమిత్తం రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం మలికిపురం గ్రామానికి చెందిన జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్ కుమారుడు జైదీర్ ఏర్పాటు చేసిన ‘మినీ వారాహి’ లక్కీ డ్రా మంగళవారం తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రా లో 3000 మంది పాల్గొన్నారు. ఈ లక్కీ డ్రాలో చింతలపల్లి గ్రామానికి చెందిన జి. నరసింహరావు మినీ వారహిని సొంతం చేసుకున్నారు. ఈ లక్కీ డ్రా ద్వారా వచ్చిన ₹3,00,000 రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, ఎంపీటీసీలు, సర్పంచులు, క్రియా వాలంటీర్లు జనసైనికులు, తదితరులు పాల్గొనడం జరిగింది.