రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలి

మణిపాల్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జస్టిస్ నజీర్ గారికి అపెండిసైటీస్ శస్త్ర చికిత్స చేశారు. తగిన విశ్రాంతి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో విధులకు హాజరు కావాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.