మంత్రి వేణు తీరు దారుణంగా ఉంది: పితాని బాలకృష్ణ

కోనసీమ జిల్లా ముమ్మిడివరం: జనసేన ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ చార్జి పితాని బాలకృష్ణ ముమ్మిడివరం జనసేన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శెట్టిబలజీ కులస్తులకు ఏం మేలు జరిగిందని వైవిసుబ్బారెడ్డి కాళ్ళపై పడ్డావు.. నీకు మేలు జరిగితే నువ్వు మీ నాయకుల ఇంటికెళ్లి కాళ్ళు ఓత్తుకో.. అంతేగాని కులం మొత్తానికి ఏదో మేలు జరిగిందని పేర్కొని బహిరంగంగా కాళ్ళమీద పడటం దారుణం.. దీనికి నీవు జాతికి క్షమాపణ చెప్పాలి.

అంతేకాదు మాయావతి కాళ్లు పవన్ పట్టుకోలేదా అని ప్రశ్నించి దళితుల మనో బావాలు సైతం నీవు దెబ్బతీసావు.. తల్లిలాంటివ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన మాయావతి కాళ్లు పట్టుకోవడానికీ మీ పార్టీ నాయకులు కాళ్లు ముందు మోకరిల్లడానికీ పోలిక చూపడం నీ అహంకారానికి నిదర్శనం..

జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టిన బి.సి.కార్పోరేషన్ ల ధ్వారా ఒక్కరికైనా లబ్ధి జరిగిందా చూపించు చర్చకు సిద్దం అన్నారు పితాని బాలకృష్ణ రాష్ట్రంలో మెట్టమొదటి సీటు శెట్టిబలిజీలకు కేటాయించి.. రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరోలో సైతం సముచిత స్థానం కల్పించిన ఘనత పవన్ కళ్యాణ్ ది, అంతేకాదు పార్టీలో అనేక కీలక పదవులు బడుగు బలహీన, దళితులకు కేటాయించిన పార్టీ జనసేన పార్టీ అని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు.