నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్

విశాఖ విచ్చేసిన రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుని విశాఖ జనసేన నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా నగర పరిధిలో జనసేన పార్టీకి సంబందించిన పలు అంశాలను నాగబాబు దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ అధ్యక్షులు రమేష్ బాబు, పెద్దలు సతీష్, విజయ్, చందర్రావు, సునీల్ పలువురు పార్టీ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ఉత్తరాంద్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా ఇటీవల నియామకమైన సుందరపు సతీష్ కి జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ శాలువా వేసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు రమేష్ బాబు, జనసేన పార్టీ నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.