దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయకు మోదీ నివాళి

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆదర్శనీయుడని, అందరికీ స్ఫూర్తి అన్నారు. ‘స్వావలంబన భారతదేశం’ కోసం కృషి చేశారన్నారు. భారతదేశ విదేశాంగ విధానం దేశమే ముందు అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నదని, ఒత్తిడి నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. మన భావజాలం దేశభక్తికి సంబంధించినదని, మన రాజకీయాల్లో కూడా జాతీయ విధానం చాలా ప్రధానమైనదని పేర్కొన్నారు.