పెనుమూరులో ఘనంగా మోహనరంగా వర్ధంతి వేడుకలు

  • ఆపద్బాంధవునికి అద్భుతమైన అశ్రునివాళి
  • రంగా ఆశయాలను జనసేన, తెలుగుదేశం నెరవేరుస్తుంది
  • జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పెనమూరు మండల కేంద్రంలో జనసేన, కాపు సంక్షేమ యువసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆపద్బాంధవుడైన వంగవీటి మోహన రంగాకు అద్భుతమైన అశ్రునివాళులు అర్పించారు. రంగా ఆశయాలను జనసేన, తెలుగుదేశం 2024 సరికొత్త ప్రజా ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పెనుమురు మండల్ ప్రెసిడెంట్ పామూరు శ్రీనివాసులు, జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాదం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, మండల్ యూత్ ప్రెసిడెంట్ గురుప్రసాద్, మండల వీరమహిళ రేణుక, టీడీపీ మండల ప్రెసిడెంట్ రుద్రయం నాయుడు, టీడీపీ ఎక్స్ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, కాపు సంక్షేమ సేన మండల్ ప్రెసిడెంట్ పసుపులేటి రమేష్, జనసేన నాయకులు, జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు.