జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్ళాణ్ గారు ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ సూచనలుతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆనందమయి హోటల్ లో శ్రీకాకుళం జిల్లాకి సంబందించిన పది నియోజకవర్గాలకు సంబందించిన నాయకులు, జనసేన సమన్వయకర్తల సమక్షంలో మరియు ముఖ్య నాయకులు, మండల నాయుకులు, జనసైనికులు, వీరమహిళల సమావేశానికి హాజరైనారు. సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ తొందరలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గం కమిటీలు యాక్టీవ్ గా పనిచేసిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలని జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని అయన మాట్లాడారు. ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం తరుపునుంచి నిమ్మల నిబ్రం మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తు వలన సీటు ఎవ్వరికి ఇచ్చిన అందరిని కలుపుకోని నియోజకవర్గంలో గేలిపించే బాధ్యత నాతో పాటుగా మా నియోజకవర్గంలో నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ పిసిని చంద్రమోహన్ కు పాలకొండ నియోజకవర్గం జనసేన టీమ్ తో మర్యాదపూర్వకంగా సన్మానం చెయ్యడం జరిగింది.