మోకాళ్ళపై బెంతు ఒరియాల నిరసన

శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల బెంతు ఒరియాలకు యస్ టీ కుల ధృవీకరణ పునరుద్ధరణ చేయాలని 14వ రోజు రిలే నిరాహార దీక్షలో నెలవంక గ్రామ వీరమహిళలు మరియు పెద్దలు యువత నిరుద్యోగులు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని మోకాళ్లపై నిల్చోని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. వెంటనే అకారణంగా ఆపి ఉంచిన బెంతు ఒరియా కుల ధ్రువీకరణ పత్రాలు టెక్కలి ఆర్డిఓ గారు విడుదల చేయాలనీ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బిసాయి, మేఘనత్ బిసాయి, దయానిధి, ఢిల్లీ మోహన్, సత్యన్నారాయణ, జయసేన్ బిసై, గోపి, కృష్ణ దలై తదితరులు పాల్గొన్నారు.