అమ్మవారి సేవలో మోటూరి దంపతులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, దేవీ నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా ఈ సంవత్సరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీ కనకదుర్గ అమ్మవారి వెండి విగ్రహం బహుకరించిన సందర్భంగా కామనగరువు పర్రకోటి వంతెన వద్ద వెలసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు పీటల మీద కూర్చుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన అమ్మవారి విగ్రహంతో నవరాత్రులు నిత్యం ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు చేసి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టనున్న బస్సు యాత్ర విజయవంతం అవ్వాలని వచ్చే 2024లో ఆయన సీఎం అవ్వాలని ఉదయం సాయంత్రం నియమనిష్టలతో ఆ దంపతులు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.