విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు వాటర్ బాటిల్స్, గ్లూకోస్ అందించిన జనసేన

పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ నియోజకవర్గం దసరా నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పాలకొండలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వారికి సుమారు 60 మంది కానిస్టేబుల్స్ కి జనసేన పార్టీ తరఫున వాటర్ బాటిల్స్, గ్లూకోస్, బిస్కెట్ ప్యాకెట్లను పాలకొండ జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను సేవా భావాలను ముందుకు తీసుకెళ్లడంలో పాలకొండ జనసేన పార్టీ ముందుంటుందని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్ల మన్మధరావు, షేక్ ఆజాద్, ప్రశాంత్ పోరెడ్డి, పొట్నూర్ రమేష్, జామి అనిల్, భాను, ప్రవీణ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.