పొరస్ ఫ్యాక్టరీని ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించాలని జనసేన డిమాండ్

పోరస్ కెమికల్ ఫ్యాక్టరీనీ ఇండస్ట్రియల్ ఏరియా కు తరలించాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలనీ – జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివరామకృష్ణ డిమాండ్ చేశారు.
అక్కిరెడ్డిగూడెం పొరస్ ఫ్యాక్టరీని అక్కడి నుండి ఇండస్ట్రియల్ ఏరియా కు తరలించాలని మంగళవారం స్థానిక అక్కిరెడ్డిగూడెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు ఆర్డీఓ గారికి నూజివీడు నియోజకవర్గ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కడియం సత్యనారాయణ, బర్మా గోపాలస్వామి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, మండల అధ్యక్షులు అబ్బూరి రవికిరణ్, యర్రంశెట్టి రాము, అరెల్లి కృష్ణ, నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, నక్క సత్య, దంతు రంగా రావు, బజారు శేషు, ఏనుగులు చక్రి, రామిశెట్టి తేజస్విని, నిట్ల ఉమమహేశ్వరి, రైతు నాయకులు రేవినిశెట్టి సత్యనారాయణ, నీలగిరి రమేష్, చేరుకుమల్లి కిషోర్, పండు పాల్గొన్నారు. తదనంతరం మీడియాతో జనసేన నాయకులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు, మహిళల అభిప్రాయలని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నష్ట పరిహారం కోటి రూపాయలు ఇవ్వాలని ఆర్డీవో నీ కోరారు.