వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన ఎంపీ రఘురామకృష్ణ

ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఆయన ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లయింది. సీఎం జగన్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా వైఎస్ కు నివాళులు అర్పిస్తూ తమ ప్రియతమ నేతను స్మరించుకుంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గులాబీ పూరేకులు చల్లుతూ వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటో సందడి చేస్తోంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు ట్విట్టర్ లో పంచుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నా నివాళులు… జోహార్ వైఎస్సార్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.