స్నేహితుల దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎంపీటీసీ కనకదుర్గ

ఇమ్మిడివరప్పాడు: స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇమ్మిడివరప్పాడు వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ధన సహాయంతో శనివారం వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నక్కా వారి పేటలో ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, బలపాలు, బిస్కెట్ ప్యాకెట్లు ఈ దంపతుల ధన సహాయంతో అన్ని తరగతుల విద్యార్థులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమం వ్యవస్థాపకులు విక్టరీ సులోచన దంపతులు, స్కూలు ఉపాధ్యాయులు, సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీ వార్డు నెంబర్లు, విద్యా కమిటీ చైర్మన్ మరియు చిందాడగరువు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.