ముచ్చుం సత్యవతికి నివాళులు అర్పించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం పాతవెలుగుబంద గ్రామంలో ముచ్చుం సత్యవతి స్వర్గస్తులైనారు. గురువారం జరిగిన సత్యవతి పెదకార్యం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముక్కుపాటి గోపాలం, నల్లమోలు వీరబాబు, నల్లమోలు సోమరాజు, ప్రగడ సుబ్రహ్మణ్యం, బరుసు గోవిందు, ముత్యం లక్ష్మణరావు, బోయిడి వెంకటేష్, ఈస్ట్ గాణుగూడెం ప్రెసిడెంట్ గల్లా రంగా, యర్రంశెట్టి శ్రీను, వేణు, అడ్డాల దొరబాబు, తోట అనిల్ వాసు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.