సీతారత్నంకు నివాళులు అర్పించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామవాసి అడబాల జగ్గారావు భార్య సీతారత్నం స్వర్గస్తులై నేటితో సంవత్సర కాలం పూర్తి అయ్యింది. గురువారం జరిగిన సీతారత్నం సంవత్సరీకం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని సీతారత్నం ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోయిడి వెంకటేష్, ఈస్ట్ గానుగూడెం ప్రెసిడెంట్ గల్లా రంగ, యర్రంశెట్టి శ్రీను, పల్లపు చక్రం, అడబాల అన్నవరం, జాజుల ధర్మరాజు, అడబాల రాజాబాబు, సింగలూరి మణికంఠ, వేణు, అడబాల దొరబాబు, అడబాల బాబీ, అడబాల ఆదివిష్ణు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.