శ్రీ కనకదుర్గా దేవి వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే తల్లి అమ్మలు గన్న అమ్మగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి 5వ వార్షికోత్సవం కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించారు. అనంతరం వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన అంతమొంది ప్రజా పరిపాలన వచ్చి ప్రజలు అందరు సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలియజేసారు. అనంతరం గుడి ప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని కార్యక్రమానికి వచ్చిన అశేష భక్త జనులకు స్వయంగా అన్న వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడిగట్ల గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.