శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా సేనకోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, గాదరాడ జనసేన పార్టీ నాయకులు, గాదరాడ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కేశంశెట్టి ఏడుకొండలు పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో కేశంశెట్టి ఏడుకొండలు గత కొన్నిరోజుల క్రితం ప్రమాదంలో గాయాల పాలవడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివ రామ్, రాజానగరం మండల నాయకులు వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాష్, నిడిగట్ల జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.