శ్రీ కనకదుర్గమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధురుపూడి గ్రామంలో నందే అరవకొండ, నందే సత్యనారాయణ జ్ఞాపకార్థం భక్తులు కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ప్రారంభించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటి వారు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిని శాలువా &పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మధురుపూడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.