ఈదుపురం గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

ఇచ్చాపురం నియోజకవర్గం: ఈదుపురం పంచాయతీలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి బాసి భారతి రెడ్డి, జనసేన నాయకులు సంజయ్ రౌలో, చిట్టు బెహరా మరియు గ్రామ జనసైనికులు సహాయంతో నిర్మించిన జనసేన జెండా స్తూపం వద్ద ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు చేతుల మీదగా జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా సమక్షంలో వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం బెహారా సొసైటీ ఏక్స్ ప్రెసిడెంట్ మరియు వైసీపీ నాయకుడు ఢిల్లీ బెహారా మరియు పలువురు నాయకులు వైసీపీ నుండి జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన, టిడిపి పొత్తు పెట్టుకున్నాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా అత్యధిక మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న చాలా సమస్యలు దృష్టిలో ఉన్నాయని అవి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన పాలన అందించే దిశగా ప్రతీ ఒక్కరూ అడుగులు వేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఇచ్చాపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాసి నీలవేణి రెడ్డి, కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వరరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జి లు రోకళ్ళ భాస్కర రావు, కలియ గౌడ, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ధనుంజయ్, మన్మధ, బడే రాజు, సతీష్, క్రాంతి, ప్రేమ్, జోగారావు, కృష్ణ, రాజశెట్టి, హేమంత్, నాగరాజు, రఘు, నవీన్, రుక్మందర్, సురేష్, చలపతి, భాస్కర్, నవీన్, కృష్ణ, కోగేష్, రమేష్, నరసింహ, శేషారావు, శ్రీను, బైరాగి మరియు జనసైనికులు, వీరమహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.