ఆకుల శ్రీనివాసులును పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం, మధురపూడి గ్రామంలో ఆకుల శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట మధురపూడి గ్రామ జనసేన నాయకులు, జనసేన పార్టీ నాయకులు అడ్డాల శ్రీనివాస్, కొత్తపల్లి రఘు, చిట్టిప్రోలు సత్తిబాబు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), అడ్డాల దొరబాబు, రామిశెట్టి సతీష్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.