పెద్దిరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామానికి చెందిన తెన్నేటి పెద్దిరాజు కుమారుడు బైక్ ఆక్సిడెంట్ లో గాయపడి రాజోలు ప్రాథమిక హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు శుక్రవారం వారిని కలసి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట చింతలమోరి గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురు మనోహర్, తెన్నేటి రమేష్ తదితరులు ఉన్నారు.