గాదరాడ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో పలు కుటుంబాలను బుధవారం రాజనగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి, పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా జట్ల అంజి నడుముకు ఆపరేషన్ చేయించు కొన్నారు. విషయం తెలుసుకొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించడం జరిగింది. అనంతరం నిడదవోలు మల్లేశ్వర రావు పెరాల్సిస్ తో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని పలకరించడం జరిగింది. అనంతరం గెడ్డం నూకాచారి ఇటీవల ఆక్సిడెంట్ లో గాయాలు పాలైన విషయం తెలుసుకుని వారిని పలకరించడం జరిగింది. తదనంతరం డాక్టర్ చీర్ల శివ సుబ్రహ్మణ్యం అమ్మగారు ఇటీవల స్వర్గస్తులైనారు నేడు పెద్ద కార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వల్లేపల్లి రాముడు గారు ఇటీవల స్వర్గస్తులైనారు. నేడు వారి చిన్న కార్యక్రమం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చివరిగా ఆలస్యం రాము ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట సీనియర్ నాయకులు చిక్కిరెడ్డి దొరబాబు, మైరెడ్డి బుజ్జి, గల్లా సతీష్, బొమ్మల రాజు, జోకా శేషగిరి, అరిబోలు వెంకటేష్, జట్ల శ్రీను, పినమరెడ్డి విజయ్, గరగ త్రిమూర్తులు, పోలిశెట్టి సతీష్, దేవన దుర్గాప్రసాద్ (డి.డి), కుంచె గిరిధర్, ఎర్రంశెట్టి పోలరావు, తోట అనిల్ వాసు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.