నరేంద్రపురంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో పలు కుటుంబాలను శనివారం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. తిరుమల యాత్ర విషాద సంఘటనలో ప్రమాదానికి గురైన క్షతగాత్రులను, మృత్యువాత పడ్డ వారి కుటుంబాలను పరామర్శించారు. తిరుమల సైకిల్ యాత్ర ప్రమాద బారిన పడ్డ చౌటుపల్లి శ్రీనును, వారి కుటుంబ సభ్యులను పలకరించి వారి ఆరోగ్య యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సైకిల్ యాత్ర ఘటనలో నరేంద్రపురం గ్రామానికి చెందిన మారెడ్డి రాంబాబు తలకు గాయమై చికిత్స అనంతరం ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని వారిని వారి కుటుంబ సభ్యులను పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తిరుమల సైకిల్ యాత్ర విషాద ఘటనలో మృతి చెందిన అర్జి నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. తిరుమల భక్తులకు గురువుగా వ్యవహరిస్తున్నటువంటి ఉల్లి విష్ణుమూర్తి (పుల్లయ్య)నెల్లూరు జిల్లా కావలి వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఈరోజు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ భగవంతుడు ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉండి సదా రక్షించాలని కోరారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందిన దేశాల వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. గుండె జబ్బుతో మరణించిన జాలెం నల్లయ్య భార్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నల్లయ్య కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. వీరి వెంట నరేంద్రపురం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ నాయకులు ఉన్నారు.