తోకాడ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో పలు కుటుంబాలను సోమవారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి, పరామర్శించారు. ముందుగా తోకాడ గ్రామానికి చెందిన పెమ్మనబోయిన శ్రీనివాసుకు ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోకాడ గ్రామానికి చెందిన గండి వెంకటేషులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అనంతరం తోకాడ గ్రామానికి చెందిన గుళ్ళింకల చెల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట తోకాడ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ యార్ల వీరబాబు, సీనియర్ నాయకులు పంతం సూరిబాబు, పసుపులేటి గోవింద్, గుర్రాల నాగేశ్వరావు, బగుల శ్రీను, దేశాల మణికంఠ, గుళ్ళింకల మహేష్, వేగిశెట్టి రాజు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), మదిరెడ్డి బాబులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.