కోరుకొండ మండలంలో పలువురిని పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలంలో శనివారం పలువురిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో జాజుల సత్యవతి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారిని పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో సిద్ద సూరిబాబు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో బొంతు అప్పారావు గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో గంధం వాడపల్లి (అబ్బన్న) పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుబోలు బాలు, గళ్ళా సతీష్, గరగ త్రిమూర్తులు, పాలిశెట్టి సతీష్, పాలెం రమేష్, కుంచె గిరి, జాజుల గణేష్, బత్తిన శ్రీరామ్, ముళ్లంగి మణి శంకర్, బాస్ బాబీ, దేవన దుర్గా ప్రసాద్ (డి డి) తదితరులు పాల్గొన్నారు.