పోలవరంలో జనం కోసం జనసేన 95వ రోజు

బుట్టాయిగూడెం మండలంలో గుర్రపుగూడెం, రంగాపురం, గుబుసుమామిడి గ్రామంలో మండల అధికారి ప్రతినిధి మెట్ట బుచ్చిరాజు గారు మరియు ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ ఏడుకొండలు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 95వ రోజు కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జనసేన యొక్క మేనిఫెస్టో ఉంది ప్రతి ఒక్కరికి వివరిస్తూ, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే పథకాలు, గ్రామాలు మండలాలు నియోజకవర్గలు వారీగా చేయబోయే అభివృద్ధిని వివరించడం జరిగింది. ప్రతిరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే, ఈ వైసిపి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అసమర్థత, చేతకానితనం కనిపిస్తుందని తన సొంత గ్రామానికి వెళ్లడానికి రోడ్డు పోయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే మొదటి మూడు నెలల్లో రోడ్లు వేసే బాధ్యత మాది అని గ్రామస్తులకు చిర్రి బాలరాజు గారు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాదం కృష్ణ, పంచాయితీ ప్రెసిడెంట్ కొమరం మధు, జోడే కృష్ణమూర్తి, జోడే ప్రసాద్, ఉడతా శివ, మిడియం వంశీ, జి. సతీష్ నాయుడు, కే. విజయ్ నాయుడు, సన్నీ, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.