మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు గ్రామాలలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి లోకం మాధవి తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించడం జరిగింది. తుఫాను తీరం దాటిన తర్వాత విపరీతంగా వీచిన గాలుల వల్ల వరి పనలు నేల వాలాయని, నీట మునిగిన వరిని అన్నదాత కష్టాలను స్వయంగా చూసిన మాధవి చలించిపోయారు. ఈ సందర్భంగా శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా ఎక్కువ శాతం వరి పైరుకి ఎక్కువ నష్టం కలిగిందన్నారు. అనేక ప్రాంతాలలో పంటలకు ముంపునకు గురయ్యాయి. కోతకోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తీసేందుకు రైతులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని రైతులుకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున నుంచి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.