మిచౌంగ్ తుఫాను బాధితులను పరామర్శించిన శ్రీమతి పోలసపపల్లి సరోజ చెరియన్

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ రూరల్ మండలం, సూర్యాపేట గ్రామ పంచాయతీ పరకాల గ్రామంలో తుఫాను ప్రభావంతో వ్యవసాయం అతలాకుతలం అయిందని, ఎన్నో గ్రామాలను కలుపుతూ వెళ్లే బ్రిడ్జి మార్గం ప్రమాదాల వలయంగా మారిందని అక్కడి గ్రామ ప్రజలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపపల్లి సరోజ చెరియన్ పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణమని, విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకూడదని, ప్రభుత్వం తక్షణం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు వాసంసెట్టి శ్రీనివాసు, దుర్గా ప్రసాద్, పలివెల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.