దాకరపు కొండలు కుటుంబాన్ని పరామర్శించిన ముదినేపల్లి మండల జనసేన

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో మన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న దాకరపు కొండలు శనివారం రామవరపుమోడీ దగ్గర బైక్ యాక్సిడెంట్ అయ్యి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య జనసేన పార్టీ కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కొత్తపల్లి జనసైనికులు పరామర్శించారు. ఈ సందర్బంగా వెంకయ్య, నానాజీ మాట్లడుతూ.. జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త మరణించడం బాధాకరం అని అయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. త్వరలో తాము ఆర్థికంగా కూడా దాకరపు కొండలు కుటుంబాన్ని ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కొత్తపల్లి జనసైనికులు మాట్లపూడి మదన్, బోయిన దుర్గా రావు, పొన్నముడి ఫణి కుమార్, పాశం శ్రీను, పుషడపు సతీష్, సుదాబత్తుల సాయిష్ తదితరులు పాల్గొన్నారు.