వైసీపీ నేతలపై ముఖరం చాన్ ఫైర్

  • రాజంపేట పార్లమెంట్ జనసేన ఇంచార్జ్ ముఖరం చాన్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేటలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాన్ హాజరై వైసీపీ నేతలు జోగి రమేష్ అంబటి రాంబాబు కొరముట్ల శ్రీనివాసులు రోజా గారిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజా నీకు నగరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సీటు వస్తాదో రాదో కూడా తెలియని నీకు మా అధ్యక్షులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైసిపి నేతలు కొరముట్ల శ్రీనివాసులు గారికి, అంబటి రాంబాబు గారికి జోక్ రమేష్ గార్లకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదని మీరంతా మీ బతుకంతా అని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, రామాశ్రీనివాస్, గోపి, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.