మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గుడివాడ జనసైనికులు

గుడివాడ: గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ దగ్గరలోని రోడ్డు గుంటల మయంతో ప్రజలు ఇబ్బంది పడడంతో మున్సిపల్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు ఆ రోడ్లను మరమ్మత్తులు చేయించారు. అక్కడ ప్రజలు, వాహనదారులు ఆర్కే కు గుడివాడ మున్సిపల్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు రోడ్డు పై గుంటలు పడి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చే రోజుల్లో భీమవరం గేటు మీద ఫ్లై వోవర్ నిర్మాణ సమయంలో ఈ రోడ్డు ప్రాముఖ్యత పెరుగుతుంది. ట్రాఫిక్ ఇటు వైపు మళ్ళించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డు పై గుంటలను పూడ్చి ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు రోడ్లు మరమ్మత్తులు చేయడం జరిగింది వారికి ప్రజల తరఫున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, కిరణ్, శివ, చరణ్ పాల్గొన్నారు.