టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది
అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగు తుంది. గత రెండు మ్యాచ్లో విజయం సాధించిన ముంబయి.. ఈ మ్యాచ్తో హ్యాట్రిక్ కొట్టడానికి ప్రణాళికలను రచిస్తుంది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్.. ముంబయిని ఓడించి టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు.