టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది

అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్ మధ్య మ్యాచ్​ జరుగు తుంది. గత రెండు మ్యాచ్​లో విజయం సాధించిన ముంబయి.. ఈ మ్యాచ్​తో హ్యాట్రిక్​ కొట్టడానికి ప్రణాళికలను రచిస్తుంది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్.. ముంబయిని ఓడించి టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్​ గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని కెప్టెన్​ రోహిత్​ శర్మ భావిస్తున్నాడు.