శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న ముమ్మారెడ్డి

కూకట్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు అవతరించిన రోజు, సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నారు. అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ఆదర్శనీయులని ప్రేమ కుమార్ తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానము, శ్రీ విశ్వనాథ స్వామి ఆలయ సముదాయము, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వార్ల ఆలయ త్రాయోవింశతి వార్షిక బ్రహ్మోత్సవల్లో బాగంగా, వసంత నగర్ లో సీతారాముని కళ్యాణంలో ప్రేమ కుమార్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయ అధికారులు ప్రేమ కుమార్ ని శాలువాతో సన్మానించారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమారు నియోజకవర్గంలో వసంత నగర్, 5వ ఫేస్ వినాయక గ్రౌండ్, ఎం.ఐ.జి గ్రౌండ్స్, హెచ్.ఐ.జి గ్రౌండ్స్, కేపీహెచ్బి 1వ ఫేస్ లో తెలంగాణ స్టేట్ స్ట్రీట్ వెండర్ అసోసియేషన్ వారు నిర్వహించిన, మరియు వి.రామారావు నగర్, మోతీనగర్ లలో సీతారాములవారి కళ్యాణములో పూజ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, షణ్ముఖ, రఘు, పులగం సుబ్బు, మధుసూదన్ రెడ్డి, అంజి, సాలాది శంకర్, సత్యసాయి, వీరమహిళలు సత్యా ఎర్ర, అడబాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.