నంద్యాలలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

నంద్యాల పట్టణంలోని కోటవీధి 4 వార్డులో జనసేన నాయకులు గురు, ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా 4 వార్డు ప్రజలకు, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, విశ్వహిందూ పరిషత్ యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి, బజరంగ్ దళ్ సందీప్ పోలేపల్లి హాజరైనారు.