యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన ముత్తా శశిధర్

యువత భవిష్యత్ మార్చేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఎసి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్ధానిక 31వ డివిజన్ సూర్యనారాయణపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాకనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన యువశక్తి పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో యువత భవిష్యత్ ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యం చేశారని రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి దిక్కు తోచనిస్థితిలో కొట్టిమిట్టాడుతుందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం యువత బతుకులు బుగ్గిపాలు చేస్తుందని తెలిపారు. నిర్వీర్యం అయిన యువత బతుకుల్లో వెలుగులు నింపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12న శ్రీకాకళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనీ ఈ కార్యక్రమంలో యువత ఎదుర్కొంటున్న సాధక బాధకాలు, అనుభవాలు క్రోడీకరించి తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, యువశక్తి సభకి కాకినాడ సిటి కో-ఆర్డినేటర్గా చిట్టూరి మౌనిక్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్ష్యులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కాకినాడ సిటి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఓలేటి రాము, అడబాల సత్యన్నారాయణ, ప్రధాన కార్యదర్శులు భాస్కర్, రమణా రెడ్డి, వలీ బాషా, కార్యదర్శులు సుమంత్, సమీర్, దుర్గా ప్రసాద్, సహాయ కార్యదర్శులు దారపు శిరీష, పెసంగి రాజేష్, హ్య్మవతి, కటారి శ్రీను, ధోనీ, చీకట్ల వాసు, సురేష్, రామక్రిష్ణ, యువశక్తి సభ కాకినాడ సిటి కో-ఆర్డినేటర్ చిట్టూరి మౌనిక్, పెద్దిరెడ్డి రాజేష్, వంశీ తదితర జనసైనికులు పాల్గొన్నారు.