రాజాం నియోజకవర్గంలో మురిసిన 75అడుగుల మువ్వన్నెల జెండా

  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

రాజాం నియోజకవర్గంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం 75అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) మాట్లాడుతూ.. మన అందరం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే మన దేశం కోసం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ప్రతిఫలం అ..ని అందుకే మన అందరం వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని.. మనం కూడా వారి త్యాగాలు వృధా కాకుండా మన దేశం కోసం మనవంతు కృషి చేసి.. మన దేసాన్ని ఎలా అయితే వారు గొప్పగా చూడాలని కలలు కన్నారో.. వారి కలలు మన అందరం సకారం చేయాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనందరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, రెడ్డి బాలకృష్ణ, నమ్మి దుర్గారావు, హరి బాబు, లక్ష్మణ్, శరత్, వైకుంఠం, రాము, ఈశ్వర్ మరియు వీరమహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *