గాజువాకలో ‘నా సేన కోసం నా వంతు’

గాజువాక నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా నాసేన కోసం నా వంతు అవగాహనా కార్యక్రమం జివి ఎమ్ సి 85వవార్డులో చేరిన శనివాడ కాలనీలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జి.వి.ఎమ్.సి 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, అందరూ ఎంతో ఉత్సాహంతో ముందరకు వచ్చి, గ్రామస్తులను కూడా చైతన్యపరిచి క్రౌడ్ ఫండింగ్ యొక్క ఆవశ్యకతను తెలియజేసి, ఎక్కువమందిని పార్టీలో భాగస్వామ్యం చేసి పార్టీకి విరివిగా తమ శక్తి కొలది విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.