అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన దెందులూరు జనసేన

దెందులూరు, ఆంద్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని కోరుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు “అమరావతి నుంచి అరసవల్లి” వరకు చేస్తున్న మహా పాదయాత్రలో భాగంగా గురువారం దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున పాదయాత్రలో పాల్గొని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, జనసేన నాయకులు కొఠారి అదిశేషు మరియు జనసైనికులు పాల్గొన్నారు.