సత్యవేడులో ‘నా సేన కోసం నా వంతు’

సత్యవేడు నియోజకవర్గం భి.ఎన్.కండ్రిగ మండల అధ్యక్షుడు బాషా ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం గురుంచి జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. 10 రూపాయలు నుండి ఎంతయినా విరాళాలు ఇవ్వాలని, నా సేన కోసం నావంతు కార్యక్రమం జనసేన పార్టీకి ఆక్సిజన్ లాంటిదని, ప్రజలను ఇందులో భాగస్వాముల్ని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యవేడు మండల అధ్యక్షుడు రూపేష్, నాయకులు కృష్ణ, ఢిల్లీబాబు, హరి, శరత్, బాలాజీ, భాస్కర్, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.