దత్తిరాజేరు మండలంలో పర్యటించిన తుమ్మి లక్ష్మీ రాజ్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించి మహిళల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని అభివృద్ధి టౌన్ మధ్యలో బిల్డింగులు ఉంటే అభివృద్ధి కాదు జగన్ మోహన్ రెడ్డి రూరల్ ఏరియాలో కరెంటు నీరు మౌళిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధి. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని జనసేన వీర మహిళా విభాగం ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ అన్నారు.