ఎస్ ఆర్ పురంలో ‘నా సేన కోసం నా వంతు’

  • ఎస్ ఆర్ పురం జనసేనకు పుట్టినిల్లు
  • మండలంలో జనసేనకు తిరుగులేదు
  • కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
  • విద్య, వైద్యం, న్యాయం జనసేనకే సాధ్యం
  • క్రౌడ్ ఫండింగ్ విజయవంతం చేయాలి
  • జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో ‘నా సేన కోసం నా వంతు’, ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఆర్ పురం మండలం జనసేనకు పుట్టినిల్లని, ఒకసారి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ఉద్భోధించారు. మండలంలో జనసేనకి తిరుగులేదని, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ప్రభోదించారు. విద్య, వైద్యం, న్యాయం ప్రజలకు తారతమ్య భేదాలు లేకుండా అందించడం జనసేనకే సాధ్యమని తెలియజేసారు. మండల ప్రజలను అభ్యర్దిస్తున్నా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అందలం ఎక్కించమని, అయన ద్వారానే సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ సాధ్యమని ఉద్ఘాటించారు. ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ సేవలకు మండలంలోని ప్రజలు, నాయకులు, ఆత్మీయులు, మెగా కుటుంబ సభ్యులు, జనసైనికులు స్వచందంగా విరాళం పది రూపాయల నుండి ఎంతైనా 7288040505, 7288040505@upi నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా పంపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షులు చార్లెస్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.