బత్తుల ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి మల్లంపూడి ప్రజానికం ఘనస్వాగతం పలికారు. ప్రజాక్షేమం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపే కార్యక్రమమే నా సేన కోసం నా వంతు కార్యక్రమం బత్తుల వెంకటలక్ష్మి జనసైనికులకి వివరించారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజలకోసం పాటుపడుతున్న పార్టీ జనసేన అని ఘంటాపథంగా తెలియజేసారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీకీ మద్దతుగా నిలవాలని తెలియజేసారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్కార్యాన్ని తలపెట్టిన పవన్ కళ్యాణ్ కి మన వంతుగా సహకారం అందించే మార్గమే ఈ నా సేన కోసం నా వంతు కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న పార్టీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని. జనసైనికులకి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని నా సేన కోసం కోసం నా వంతు కార్యక్రమంలో చూపించినందుకు. మల్లంపూడి జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిదిండి మణికంఠ స్వామి, కేత వెంకటరమణ, పెంకి నాగేశ్వరరావు, చిట్టూరి స్వామి, టేకుమూడి శ్రీను, సంగుల రమేష్ బాబు, సంగుల సతీష్, మేకల నరేష్, సంగుల వెంకట గణేష్, తంబవతులు చక్రధర, పడాల శ్రీను, రాయి గంగాధర్, సంగుల లచ్చబాబు, పడాల సుబ్రమణ్యం, తంబాబత్తులు మణికంఠ, సంగుల నాగస్వామి, కలిదిండి సతీషు, గుబ్బల స్వామి, కొప్పిశెట్టి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.