వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు

కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు సమక్షంలో కనిగిరి మండల నాయకులు కోటంశెట్టి మధు ప్రోత్సాహంతో కనిగిరి పార్టీ కార్యాలయంలో అన్నంగి శ్రీనివాస్ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా 6000 రూపాయలను జనసేన పార్టీ క్యు.ఆర్ కోడ్ తో జనసేన పార్టీ బ్యాంక్ అకౌంట్ కి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరికూటి నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా పార్టీకి అండగా ఉండాలని తమ వంతు విరాళాన్ని అందించాలని తెలియచేసారు. ఈ సందర్భంగా విరాళాన్ని అందజేసిన అన్నంగి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శానం ఆంజనేయులు, ముత్యాల నరేష్, లాయర్ అనిల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నున్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.