సింగరాయకొండలో నా సేవ కోసం నా వంతు కార్యక్రమం

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గంలో శుక్రవారం సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద “నా సేవ కోసం నా వంతు” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతతో కూడిన భాగస్వామ్యం అందించి మన జనసేన పార్టీని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, ప్రజల పక్షాన ప్రజలకు అండగా ప్రతినిత్యం పోరాడుదాం. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించే దిశగా జనసేన పార్టీ ద్వారా ప్రయాణం కొనసాగిద్దాం అంటూ నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కాసుల శ్రీకాంత్, దండే ఆంజనేయులు, చాంద్ బాషా, కాసుల శ్రీను, కిరణ్, అల్తాఫ్, అరుణ్, సుల్తాన్, రాజు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.