శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి ఆశీర్వాదం పొందిన గరికపాటి

మంగళగిరిలో, గురువారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పించుకొని జనసేన పార్టీలో చేరిన గరికపాటి వెంకట్ వెంటనే తన మొదటి అడుగు విజయవంతం కావాలని రాజకీయంగా తన ప్రజాసేవ కార్యక్రమాలు దర్శి నియోజకవర్గ ప్రజానీకానికి సంపూర్ణంగా అందాలని, 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమ్మేళనలో తన గెలుపు ఉండాలని, విజయం పొందాలని, శనివారం మైసూరు దత్త పీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి దివ్య ఆశీస్సులు పొందారు. ఇప్పటివరకు తను చేసిన సేవ కార్యక్రమాలకి భిన్నంగా, రాజకీయంగా ప్రజలకు దగ్గర ఉంటూ మరింత ప్రజా సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారిని ప్రార్థించారు. జనసేన పార్టీ సిద్ధాంతాల అనుకూలంగా, పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం దర్శి నియోజకవర్గంలో పేద మధ్య బడుగు బలహీన వర్గాల ప్రజలకు వలసలు వెళ్లకుండా నిరోధిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తూ, నియోజకవర్గంలోని, యువతకు, భావితరాల వారికి నియోజకవర్గంలోనే శాశ్వత ఉపాధి కల్పించటం, రైతన్నలకు ప్రత్యేక ప్రణాళికలతో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, రైతులు ఆర్థికంగా ఎదుగుదలకు కావాల్సిన వ్యవసాయేతర కార్యక్రమాలలో సమ్మేళన చేయటం, శాశ్వతం మంచినీటి పథకాలను, మండలాల నుండి గ్రామీణ ప్రాంతాలకు లింకు రోడ్లను ఏర్పాటుచేసి నాగరికత అభివృద్ధికి తోడ్పడడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయడం కోసం ప్రజాసేవకై జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి, రుణం తీర్చుకునే భాగ్యం కల్పించమని ఆయన శనివారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి ఆశీస్సులు పొందారు.