దిగవల్లి ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన బర్మా ఫణిబాబు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, నూజివీడు మండలం, పడమట దిగవల్లి గ్రామంలో శనివారం క్రాంతి కిరణ్ మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో దిగవల్లి ప్రీమియర్ లీగ్ ను జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు బర్మా ఫణిబాబు ప్రారంభించడం జరిగింది. దిగవల్లి ప్రీమియర్ లీగ్ (క్రికెట్ నాకౌట్ మ్యాచుల)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. దిగవల్లి ప్రీమియర్ లీగ్ (నాకౌట్ మ్యాచులు) ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని బర్మా ఫణి బాబు గ్రౌండ్లో క్రీడాకారులను ఉత్సాహపరచడానికి కొంచెం సమయం క్రికెట్ ఆడటం జరిగింది. అనంతరం దిగవల్లి ప్రీమియర్ లీగ్ కమిటీ వాళ్ళు బర్మా ఫణి బాబు మరియు నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరావుని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫణి బాబుతో పాటు నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, జనసేన నాయకులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, ఇమ్రాన్, కడియం శీను మరియు క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువత భారీగా పాల్గొన్నారు.